ఏలూరులో ఫిబ్రవరి 3న ‘సిద్ధం’ సభ..

ఏలూరు జిల్లాలోని దెందులూరులో వచ్చే నెల 3న సీఎం జగన్ ‘సిద్ధం’ బహిరంగసభలో పాల్గొంటారని ఎంపీ మిదున్ రెడ్డి వెల్లడించారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించనున్న సమావేశ ఏర్పాట్లను ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి ఆళ్ల నాని, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, పార్టీ సీనియర్‌ నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి పరిశీలించారు.

ఈ సందర్భంగా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు, పోలీస్‌ శాఖకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుందని, ఈ సందర్భంగా పార్టీ క్యాడర్‌ మీటింగ్‌కు వైసీపీ అధ్యక్షులు, సీఎం జగన్ హాజరవుతారని ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల పార్టీ శ్రేణులు ఈ సమావేశానికి లక్షలాదిగా హాజరవుతారని , రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ క్యాడర్‌కు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేస్తారన్నారు.