శ్యామ్ సింగ రాయ్ కి పైరసీ దెబ్బ ..

నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న (డిసెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్లు కూడా బ్రహ్మాండంగా రావడంతో అభిమానులు , చిత్ర యూనిట్ సంబరాలు చేసుకున్నారు. కానీ ఈ సంబరాలు ఎంతో సేపు లేకుండా చేసారు తమిళ రాకర్స్. చిత్రసీమకు పెనుభారంగా మారిన పైరసీ భూతం తమిళ్ రాకర్స్..శ్యామ్ సింగ రాయ్ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్లైన్ లో పెట్టేసారు.

దీంతో చిత్ర యూనిట్ పెద్ద షాక్ లో పడ్డారు. అసలే థియేటర్స్ కు ప్రేక్షకుల ఆదరణ తక్కువ అయ్యింది..సినిమా టాక్ బాగుంది..ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూస్తారని అనుకునేలోపే..సినిమాను ఆన్లైన్ లో పెట్టేయడం అందరిని షాక్ లో పడేసింది. ఈ మధ్య కాలంలో పైరసీ భూతం మరింత ఎక్కువ అయింది. దీంతో చాలా మంది ఈ సైట్లపై రిపోర్టులు చేస్తున్నారు. దీంతో కొన్ని యూఆర్‌ఎల్‌ను క్రియేట్ చేసి మరీ సైట్లను నడుపుతున్నారు. అలాగే, వీటి కోసమే కొన్ని ప్రత్యేకమైన యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలకు కూడా ఇవి గుదిబండలా మారాయి.

‘శ్యామ్ సింగ రాయ్’ మూవీని రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించగా.. వెంకట్ బోయినపల్లి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. నానికి తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ మంచిగానే ఉంది. అందుకే ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.