పాలన చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నాడు – షర్మిల

వరి కొనుగోలు విషయంలో కేంద్రం తీరును తప్పుపడుతూ కేసీఆర్ ఈరోజు మహాధర్నా కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ పులుపు మేరకు ఈరోజు ఇందిరా పార్క్ లో మహాధర్నా అనుకున్న దానికంటే బాగా జరిగింది. ముఖ్యమంత్రి , మంత్రులు , ఎమ్మెల్యేలు , మ్మెల్సీ లు , నేతలు , కార్య కర్తలు ఇలా అంత పాల్గొన్నారు. ఈ మహాధర్నా పట్ల వైఎస్ షర్మిల మండిపడింది. పాలన చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ల కోసం కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వొచ్చు..లిక్కరు ఏరులై పారొచ్చు.. కాని రైతు పండించిన పంట కొనలేరా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించింది. బడి పిల్లలకు బువ్వ పెట్టరాదా? కొత్త రేషన్ కార్డులు ఇవ్వకూడదా? ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయచాతకాదా? అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చావు బాట పట్టిస్తూ, బడి బువ్వ బంద్ పెట్టి పేద బిడ్డలకు చదువును దూరంచేస్తూ నేటి తెలంగాణాను, రేపటి భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారు దొరగారు అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఈ పాపం నాది కాదు అన్నట్టు, ఈ రోజు రైతుల పేరుమీద దొంగ దీక్షలు చేస్తున్నవ్ పాపప్రక్షాళన చేసుకోవడానికి ధర్నాలు చేస్తున్న మీరు ముమ్మాటికీ రైతు ద్రోహే అంటూ కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేసింది.