ప్రధాని నరేంద్ర మోడీకి పాలనపై చక్కని పట్టు : పవార్

మాజీ ప్రధానుల్లో ఇది కనిపించదు..ఆసక్తి రేపుతున్న పవార్ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ : దేశ రాజకీయ రంగంలో శరద్ పవార్ ఎంతో సీనియర్. ఆయన చేసే వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇతర పార్టీ నేతలను విమర్శించడమే కాదు.. తనకు నచ్చితే మెచ్చుకోవడానికి ఆయన తటపటాయించరు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఆయన చెప్పిన అభిప్రాయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోడీకి పాలనపై పట్టుందని, అదే ఆయన బలమని శరద్ పవార్ అన్నారు. పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా పవార్ మాట్లాడారు. ప్రధాని తాను ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసే విషయంలో అధికారులు, మంత్రులను ఒక్కతాటిపైన నడిపిస్తారని పవార్ చెప్పారు. ‘‘ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు మోడీ విడిచిపెట్టరు. ఈ తరహా విధానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల్లో కనిపించదు’’ అని పవార్ పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/