లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలోనే పయనిస్తున్నాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సరికి కూడా స్టాక్ మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తూ ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ సూచీ 353 పాయింట్లు వృద్ధి చెంది 41,142 వద్ద ముగించింది. ఇక నిఫ్టీ సూచీ 109 పాయింట్లు లాభపడి 12,089 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.22 గా ఉంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/