సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఎలాంటి మోసాల్లేవు

nama nageswara rao
nama nageswara rao

న్యూఢిల్లీ: షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మీ పథాకాలను అడ్డుకోవాలని బిజెపి ఎంపీలు ప్రయత్నిస్తున్నారని టిఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ఢిల్లీ విజ§్‌ుచౌక్‌లో టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె. కేశవరావుతో కలిసి నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేయాలని చుస్తున్నారని నామా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మీ పథకాల్లో ఎలాంటి మోసాల్లేవని కేంద్రం సమాధానమిచ్చినట్లు నామా స్పష్టం చేశారు. ఈ పథకాల్లో అవినీతి ఉందని చెప్పి పథకాలను ఆపాలని బిజెపి కోరినట్లు నామా తెలిపారు. పథాకల ద్వారా ఆధార్‌ డేటాను తీసుకుంటున్నామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/