నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: గత నాలుగు రోజులుగా లాభాల్లో పయనించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. దీంతో పాటు కరోనా వైరస్ కూడా మార్కెట్లపై కొంతమేర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 164 పాయింట్లు కోల్పోయి 41,141కి పడిపోయింది. నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 12,098 వద్ద స్థిరపడింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/