తాలిబన్ల కు భారీ దెబ్బ..సీనియర్ కమాండర్ ను మట్టుపెట్టిన రెసిస్టెన్స్ ఫోర్స్
అఫ్గాన్ను ఆక్రమించుకన్న తాలిబన్లు..తాజాగా పంజ్షేర్ ను వశం చేసుకొని జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. ఈ లోపే రెసిస్టెన్స్ ఫోర్స్ తాలిబన్ల కు భారీ షాక్ ఇచ్చారు. తాలిబాన్లకు సీనియర్ కమాండర్గా వ్యవహరిస్తున్న ఫసీయుద్దీన్ మౌల్వీని రెసిస్టెన్స్ ఫోర్స్ మట్టుబెట్టింది. ఆయనతో పాటు ఉన్న మరో 13 మందిని కూడా హతమార్చినట్లు పంజ్షేర్ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటె ఆఫ్గనిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి గత వారమే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉన్నా అంతర్గత విభేదాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు కాకుండా మరొకరికి అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు తాలిబన్లు నిర్ణయించినట్లు తెలుస్తుంది.