చైతు వ్యాఖ్యలపై సామ్ రియాక్షన్..

నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఫై సమంత రియాక్ట్ అయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య , సమంతలు..కొంతకాలానికే విడాకులు తీసుకొని అందరికి షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు. తాజాగా సమంతతో విడాకుల గురించి చైతు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. తాజాగా నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ కస్టడీ. తెలుగు, తమిళ భాషల్లో మే 12వ తేదీన విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న చైతు సినిమా విశేషాలు తెలియజేస్తూ సామ్ తో విడాకులఫై పలు కామెంట్స్ చేసారు.

మేము విడిపోయి రెండు సంవత్సరాలు అవుతోంది. అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాదిదాటింది. కోర్టు కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో ముందుకు సాగుతున్నాము. జీవితంలో ఎదురయ్యే ప్రతి దశను నేను గౌరవిస్తాను. సమంత మంచి మనసున్న వ్యక్తి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేటన్లు ప్రజల్లోకి వెళ్లింది. నాకు బాధ కలిగించిన విషయం అదే’ అంటూ చెప్పుకొచ్చారు.

దీనిపై సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘మనమంతా ఒక్కటే. కేవలం అహంకారం, కొన్ని నమ్మకాలు, భయాలు మనల్ని దూరం చేస్తాయి’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో కొటేషన్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చై-సామ్‌ అభిమానులు వీరిద్దరూ కలిసుండాలని మొదటి నుంచీ కోరుకుంటున్నారు. తాజా కామెంట్‌తో కొందరు సపోర్ట్‌గా మాట్లాడుతుంటే మరికొందరు వీరిద్దరూ ఈగో కారణంగా విడిపోయారా? అని చెవులు కొరుక్కుంటున్నారు.