రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం విఫలమైందిః చింతామోహన్

chinta-mohan

నెల్లూరు: రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డబ్బులతో హెలికాప్టర్లో జగన్ తిరుగుతున్నారు. ప్రజలందరూ జగన్ రెడ్డి పేరుని హెలికాప్టర్ రెడ్డి అంటున్నారు. వెంకటగిరి బహిరంగ సభలో జనాలు లేక సీఎం సభ వెలవెలపోయింది. రాబోవు ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపికి పది స్థానాలు కంటే ఎక్కువ రావు. కేంద్రంలో బిజెపి బ్యాంకులని మోసం చేస్తుంది. దేశ ప్రయోజనాలని కాపాడలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వం నాణ్యతలేని మద్యాన్ని విక్రయించి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుంది.’’ అని చింతామోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.