కేరళలో 31 వరకు 144 సెక్షన్ అమలు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం నిర్ణయం
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో ఈరోజు నుండి నుంచి 144 సెక్షన్ విధిస్తూ ఆ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పెరుగుతున్న కోవిడ్19 కేసుల కారణంగా నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు తిరువనంతపురంలో ఒకేసారి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సమావేశం అవడాన్ని ప్రభుత్వం నిషేధించింది. కేరళలో అత్యధికంగా ఒకే రోజులో 9,258 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 77,482కు చేరుకుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/