ఆప్​ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు

Searches At AAP’s Rajya Sabha MP Sanjay Singh’s House In Delhi Liquor Policy Case

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్ ఇంట్లో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ సోదాలు చేస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసుతో లింకు ఉన్న మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఇవాళ తెల్ల‌వారుజామున ఎంపీ ఇంట్లోకి ఈడీ అధికారులు ప్ర‌వేశించారు. లిక్క‌ర్ పాల‌సీ కేసులో మ‌నీష్ సిసోడియా త‌ర్వాత ఆప్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత సంజ‌య్ సింగ్‌ను విచారిస్తున్నారు. ఈ కేసుతో లింకు ఉన్న మ‌నీశ్ సిసోడియాను ఫిబ్ర‌వ‌రిలో సీబీఐ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.

ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన 2021 మ‌ద్యం విధానంలో లోపం ఉండ‌డంతో దాన్ని ర‌ద్దు చేశారు. అయితే ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను కూడా ఏప్రిల్‌లో సుమారు 9 గంట‌ల పాటు ప్ర‌శ్నించారు. లిక్క‌ర్ కేసులో త‌న‌ను కూడా ఈడీ విచారిస్తుంద‌ని గ‌తంలోనే సంజ‌య్ సింగ్ తెలిపారు. ఆయ‌న త‌న ఇంటి ముందు వెల్క‌మ్ ఈడీ అని పోస్టరు కూడా ప్ర‌ద‌ర్శించారు.