వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ ఫోటోలను విడుదల చేసిన రైల్వే శాఖ మంత్రి

Railway minister shares Vande Bharat sleeper coach concept images. See here

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్లీపర్‌ కోచ్‌లను తీసుకురాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే వెల్లడించింది కూడా.

ఇందులో భాగంగానే తాజాగా స్లీపర్‌ కోచ్‌లకు సంబంధించిన కొన్ని ఫొటోలను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తాజాగా విడుదలు చేశారు. ఈ ఫొటోల్లో స్లీపర్‌ కోచ్‌లు ఎంతో రిచ్‌లుక్‌లో కనిపిస్తున్నాయి. రాత్రి పూట దూర ప్రయాణం చేసేవారికి అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దారు. ఇందులో ఇంటీరియర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఎంతో విలాసవంతంగా, లగ్జరీగా ఉన్న ఈ కోచ్‌లు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్లీపర్‌ కోచ్‌లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.