మే 21న పలు రైళ్లు రద్దు.. మరి కొన్ని ఆలస్యం

trains

హైదరాబాద్‌: సికింద్రాబాద్ డివిజన్ లో మే 20, 21న నడవాల్సిన పలు రైళ్లను రద్దు చేయగా.. మరి కొన్నింటిని రీ షెడ్యూల్ చేశారు రైల్వే అధికారులు. సికింద్రాబాద్ డివిజన్‌లోని ఘట్‌కేసర్ – చెర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో మే 21 న 17 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 20, 21న కొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని తెలిపారు.

రద్దు చేయబడిన రైళ్లలో సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, కాచిగూడ-మిర్యాలగూడ, సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-సిర్పూర్ ఖాగజ్‌నగర్ ఉన్నాయి. మే 20, 21 తేదీల్లో నడపాల్సిన హౌరా – సికింద్రాబాద్, త్రివేంద్రం – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – మన్మాడ్ సహా ఐదు రైళ్లు ఆలస్యంగా నడవడానికి రీషెడ్యూల్ చేయబడ్డాయి.