లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎస్ బీఐ కొత్త స్కీమ్

45 నిమిషాల్లో రూ.5 లక్షల వరకు లోన్…లోన్ తీసుకున్న ఆర్నెల్ల అనంతరం మొదటి ఈఎంఐ

sbi
sbi

ముంబయి: స్టేట్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ లోన్ స్కీమ్’ పేరిట సరికొత్త విధానం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు కేవలం 45 నిమిషాల్లోనే రూ.5 లక్షల వరకు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణ మొత్తంపై 10.5 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. అంతేకాదు, నెలసరి చెల్లింపులు కూడా ఆర్నెల్ల తర్వాత ప్రారంభమవుతాయి. అంటే లోన్ తీసుకున్న ఆర్నెల్ల అనంతరం మొదటి ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా రుణం పొందేందుకు ఎస్ బీఐ యోనో యాప్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా లాక్ డౌన్ కష్టాల నేపథ్యంలో ఈ విధానం ఖాతాదారులకు ఎంతో వెసులుబాటు కలిగిస్తుందని ఎస్ బీఐ వర్గాలంటున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/