ఖషోగి హత్య కేసులో 8 మందికి శిక్ష

2018లో టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయంలో ఖషోగి హత్య

Khashoggi
Khashoggi

సౌదీ: వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య కేసులో రియాద్ క్రిమినల్ కోర్టు 8 మందికి శిక్షలు ఖరారు చేసింది. 2018లో టర్కీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో ఖషోగి హత్యకు గురికావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. తమపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఖషోగిని సౌదీ ప్రభుత్వమే హత్య చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రాకుమారుడు సల్మాన్ కార్యాలయంలో పనిచేసిన ఫోరెన్సిక్ నిపుణులు, ఇంటెలిజెన్స్ భద్రతా సిబ్బంది నిందితులుగా విచారణ ఎదుర్కొన్నారు. అయితే, ఖషోగి కుటుంబం క్షమాభిక్షతో ఈ కేసులో ఐదుగురు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. దీంతో వీరికి 20 ఏళ్ల చొప్పున శిక్ష పడింది. మిగిలిన వారిలో ఒకరికి పదేళ్లు, మరో ఇద్దరికి ఏడేళ్లు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/