నిరూపిస్తే 100 గుంజీలు తీస్తా..మమతా బెనార్జీ

mamata-banerjee

కోల్‌కతా: ఈ సంవత్సరం బెంగాల్‌లో దుర్గపూజ నిర్వహించబోవడం లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఆ రాష్ట్ర సిఎం మమతాబెనర్జి కొట్టిపారేశారు. ఇలా ప్రభుత్వం ప్రకటించిందని నిరూపిస్తే ప్రజల ముందు ‘వంద గుంజీలు’ తీయడానికి సిద్ధంగా ఉన్నామని మమతాబెనర్జి సవాల్ విసిరారు. ‘దుర్గా పూజా విషయంలో రాజకీయ పార్టీ రకరకాలైన అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. ఈ విషయంపై తాము ఎలాంటి సమావేశమూ పెట్టలేదు. ఈ యేడాది దుర్గా పూజను రద్దు చేస్తున్నట్లు తాము ప్రకటించామని నిరూపిస్తే ప్రజల ముందు వంద గుంజీలు తీయడానికి సిద్ధంగా ఉన్నాం.’ అని మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ విషయంలో సోషల్ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిని గుర్తించి, వంద గుంజీలు తీయించండని పోలీసులను సిఎం ఆదేశించారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో మత సహనం దెబ్బతింటోందని ఆమె మండిపడ్డారు. కాళీ, దుర్గా, హనుమాన్ పూజలు చేయని వారు కూడా పూజ గురించి మాట్లాడేస్తున్నారని సిఎం మమత మండిపడ్డారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/