సంగారెడ్డి లో ప్రవైట్ బస్సు దగ్ధం ..
సంగారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మునిపల్లి మండలం భూదేరా శివారులో అర్థరాత్రి హైదరాబాద్-ముంబై హైవేపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే పక్కకు బస్సు ఆపేయడంతో ప్రయాణికులు వెంటనే దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
బస్సులో ఉన్న ప్రయాణికుల వస్తువులు బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. ఇక ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపించారు. ఒకవేళ డ్రైవర్ అప్రమత్తం కాకపోయింటే? కాసింత నిర్లక్ష్యంగా ఉండి ఉంటే ? పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణించేవారు. ఈ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడడంతో అంత ఊపిరి పీల్చుకుంటున్నారు.