ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సమీర్‌ శర్మ

ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా సమీర్‌ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీర్ శర్మకు గత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ బాధ్యతలు అప్పగించారు. తొమ్మిది నెలలపాటు ఆదిత్యనాథ్‌ దాస్ ఏపీ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ సమీర్‌ శర్మ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆప్కో సీఎండీగా బాధ్యతలు నిర్వహించారు.

ఆదిత్యనాథ్ దాస్‌ పదవీ కాలం ముగియడం తో సమీర్ శర్మకు జగన్ సర్కార్ ఆ బాధ్యతలు అప్పజెప్పారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమీర్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నవరత్నాల అమలు కోసం కృషి చేస్తా. సీఎస్‌గా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జనగ్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. అందరి సహకారంతో పని చేస్తాను’’ అని తెలిపారు.