‘డీజే టిల్లు’ సరసన సమంత..?

‘డీజే టిల్లు’ మూవీ తో యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న సిద్దు..ప్రస్తుతం ‘టిల్లూ స్క్వేర్‌’ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. మల్లిక్‌ రామ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో అనుపమ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ ప్రొడక్షన్ హౌస్ లో ఓ సినిమా చేయనున్నాడు. దీని తర్వాత నందిని రెడ్డి డైరెక్షన్లో ఓ యూత్ ఫుల్ మూవీ చేయనున్నాడని టాక్.

అలాగే ఈ మూవీ సిద్దు సరసన సమంత హీరోయిన్ గా నటించబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నందిని రెడ్డికి సమంతతో మంచి అనుబంధం ఉంది. దాంతో, ఆమెకు కథ చెప్పగా సమంత ఒప్పుకుందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా సమంత ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని నందిని ఆమె పాత్రను డిజైన్‌ చేస్తోందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

ఇక సామ్ విషయానికి వస్తే ..ప్రస్తుతం విజయ్ సరసన ఖుషి మూవీ లో నటిస్తుంది. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు.