దేశంలో కొత్తగా 7,447 కరోనా కేసులు
మరణాల సంఖ్య మొత్తం 4,76,869
corona virus -india
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 7,447 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటూన్లలో కరోనాకు 86,415 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న కరోనా నుంచి 7,886 మంది కోలుకున్నారు. అలాగే, 391 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,41,62,765కు చేరుకుంది. మరణాల సంఖ్య మొత్తం 4,76,869కు చేరింది. మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,35,99,96,267కు పెరిగింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/