జూపల్లి కృష్ణారావు అరెస్ట్

రైతుల సమస్యల కోసం రోడ్డె ఎక్కిన జూపల్లి కృష్ణారావు ను పోలీసులు అరెస్ట్ చేసారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులతో కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన నిర్వహించారు. వరి కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలని డిమాండ్ తో కలెక్టర్ రేట్ ముందుధర్నా నిర్వహించారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించాలని జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. అధికారుల నుండి స్పందన రాకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జూపల్లి తో పాటు ధర్నా చేస్తున్న రైతులను అదుపులోకి తీసుకున్నారు. జూపల్లి కృష్ణారావు అరెస్ట్ ను నిరసిస్తూ ఆయన అనుచరులు బైక్ కు నిప్పు పెట్టారు. దీంతో నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక జూపల్లి కృష్ణారావును కొద్దీ రోజుల క్రితం బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరుపుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో ఈ రెండు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. అయితే వీరిద్దరూ ఏ పార్టీలో చేరే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కీలక పాత్ర పోషించాలని జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు భావిస్తున్నారు.