చంద్రబాబు అరెస్టుపై సజ్జల స్పందన

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

2015 స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను సీఐడీ అదుపులోకి తీసుకుంది. నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును రోడ్డు మార్గంలో నంద్యాల, గిద్దలూరు,మార్కాపురం, త్రిపురాంతకం,వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు మీదుగా విజయవాడ తీసుకుని వెళ్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ ఫై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు.

కాగా చంద్రబాబు అరెస్ట్ ఫై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడిపై బలమైన సాక్ష్యాలు చేతిలో ఉన్న తర్వాతే సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేకుండా ఈ అరెస్టు జరిగినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో బోగస్ కంపెనీలను సృష్టించి ప్రభుత్వం సొమ్మును అడ్డగోలగా దోచిపెట్టారని అన్నారు. రెండు సంవత్సరాల క్రితమే సీఐడీ ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఈ అరెస్టు జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు అంటున్నారని అన్నారు. కానీ 2017,2018లోనే పూణెలో జీఎస్డీ విచారణలో షెల్ కంపెనీలకు సొమ్ము మళ్లించినట్లు అధికారులు అప్పుడే గుర్తించారని అన్నారు.