టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి శైలజానాథ్..?
టీడీపీ పార్టీ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల నేతలు తమకు అనుకూలమైన పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా టీడీపీ పార్టీ లోకి పెద్ద ఎత్తున నేతలు చేరుతున్నారు. ఇప్పటికే బిజెపి , వైస్సార్సీపీ నుండి పలువురు చేరగా..తాజాగా మాజీ మంత్రి శైలజానాథ్ సైతం సైకిల్ ఎక్కేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
గత కొంతకాలంగా శైలజానాథ్ టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం కూడా నియోజకవర్గంలో బలమైన అభ్యర్ధికోసం అన్వేషణ సాగిస్తున్న తరుణంలో ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఆయనతో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీలో చేరాలని శైలజానాథ్కు జేసీ ఆహ్వానం పలికినట్లుగా విశ్వసనీయ సమాచారం. బుధవారం టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు జేసీ దివాకర్ రెడ్డి శింగనమల వెళ్లి శైలజానాథ్తో భేటీ అయినట్లుగా సమాచారం.
ఈ భేటీపై జేసీ దివాకర్ రెడ్డిగానీ, శైలజానాథ్ కానీ ఎవరూ స్పందించలేదు. శింగనమల నంచి గతంలో రెండు సార్లు గెలిచిన శైలజానాథ్ మంత్రిగా కూడా పని చేశారు.