సినిమాలకు దూరం కాబోతున్న బ్రో హీరో

బ్రో హీరో సాయిధరమ్ తేజ్ కొంత కాలం సినిమాలకు దూరం కాబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. ప్రస్తుతం తేజ్..పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో మూవీ చేసారు. ఈ మూవీ ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో తేజ్ వరుస ఇంటర్వూస్ తో బిజీ గా ఉన్నారు.

గత ఏడాది సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఈమధ్యే ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తేజుకి ఊహించని విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు బ్రో తో రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ సంపత్ నందితో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ స్వయంగా స్పష్టం చేశాడు. అయితే ఈ సినిమా తర్వాతే తాను సుమారు 6 నెలల పాటు బ్రేక్ తీసుకోవాలనుకున్నట్లు వెల్లడించాడు.

తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నానని, ఈ విషయాన్ని తన అభిమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పాడు. అభిమానుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు ఉండవని భావిస్తున్నాను. నా అన్ని సినిమాలకు పూర్తిస్థాయి ఎఫర్ట్ ఉండాలని అనుకుంటాను. నేను ఒక చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. సర్జరీ తర్వాత మరింత బలంగా మీ ముందుకు వస్తాను. నేను పూర్తిగా కోలుకోవడానికి నాకు ఆరు నెలల సమయం పట్టొచ్చు” అంటూ సాయి తేజ్ తెలిపారు.

నిజానికి ‘నేను కోమాలో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్‌ ఇచ్చారు. దానివల్ల చాలా బరువు తగ్గాను. ఫిట్‌నెస్‌ కూడా కోల్పోయాను. అకస్మాత్తుగా స్టెరాయిడ్స్‌ మానేయడం, వర్కవుట్స్‌ చేయకపోవడం వల్ల మళ్లీ బరువు పెరిగాను. ఇప్పుడు నేను బరువు తగ్గి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని ఆలోచిస్తున్నాను ‘ అని చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ కూడా సాయి తేజ్ సర్జరీ సక్సెస్ అవ్వాలని మరింత త్వరగా కోలుకొని మళ్ళీ మంచి మంచి సినిమాలు చేయాలంటూ కోరుకుంటున్నారు.