మా ఫ్యామిలీ అంత మావయ్య వెంటే – సాయి తేజ్ క్లారిటీ

మా మెగా ఫ్యామిలీ అంత ఎప్పటికి పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారని హీరో సాయిధరమ్ తేజ్ స్పష్టం చేసారు. తాజాగా పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ హీరోలుగా బ్రో సినిమా తెరకెక్కింది. సముద్రఖని డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఫై విశ్వప్రసాద్ నిర్మించారు. జులై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

కాగా ఈ మూవీ లో ఓ సీన్ మాత్రం వివాదస్పదం అయ్యింది. సినిమాలో పృద్వి క్యారెక్టర్ ఫై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. తనను ఉద్దేశించే సినిమాలో ఆ క్యారెక్టర్ పెట్టారని నిప్పులు చెరిగారు. అంతే కాదు బ్రో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందని , నిర్మాతలకు భారీగా నష్టం వస్తుందని మీడియా సమావేశం ఏర్పాటు తెలిపారు.

దీనిపై ఇప్పటికే నిర్మాత స్పందిస్తూ..సినిమా సూపర్ హిట్ అయ్యిందని , మంచి కలెక్షన్లు రాబడుతుందని క్లారిటీ ఇచ్చారు. అలాగే సాయి తేజ్ కూడా స్పందిస్తూ..మావయ్య వెంట మా మెగా ఫ్యామిలీ అంత సపోర్ట్ గా ఉంటుందని అన్నారు. మంత్రి అంబటి రాంబాబుపై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్‌ తీయలేదని అన్నారు. సినిమాలు , రాజకీయాలు వేరు వాటిని అలాగే చూడాలని అన్నారు. తనకు రాజకీయ అనుభవం లేదని.. కానీ పాలిటిక్స్​లో మాత్రం తమ ఫ్యామిలీ అంతా పవన్ వెంటే ఉంటుందని తెలిపారు.

బ్రో’ చిత్రంలో నా క్యారెక్టర్‌ చనిపోయినప్పుడు భ్రమతో మూడు గంటలు ఏడ్చా.. పవన్‌ మామయ్యకు దూరమై పోతున్నాననే బాధతో. కానీ మేమంతా పవన్‌ కల్యాణ్‌తోనే జీవితాంతం ఉంటాం.’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. బ్రో చిత్రం కథ వినగానే ఎప్పుడెప్పుడు చేస్తానోనని ఆత్రుతగా ఎదురు చూశానని, చిరంజీవి మామయ్యతో నటించేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.