నేడు శబరిమల ఆలయం మూసివేత.. 30న పునర్దర్శనం

మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ డిసెంబర్ 30న తెరుచుకోనున్న శబరిమల

Sabarimala temple is closed today

తిరువతనంపురంః శబరిమల దేవాలయం తలుపులను డిసెంబర్ 27న రాత్రి 11.00 గంటలకు మూసివేయనున్నారు. ఆ తరువాత మకరవిళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం ద్వారాలను డిసెంబర్ 30న సాయంత్రం 5.00 గంటలకు తెరుస్తారు. మకరవిళక్కు (జ్యోతి దర్శనం) వచ్చే ఏడాది జనవరి 16న సాయంత్రం (6:36:45) కలుగుతుంది. మకర విళక్కు మహత్వష్టం (2024) పూర్తయ్యాక శబరిమల సన్నిధానం జనవరి 20న ఉదయం 6.30కు మూసేస్తారు. ఆ తరువాత భక్తుల దర్శనానికి అనుమతించరు.

శబరిమల ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు జరిగాయి. డిసెంబర్ 27న మండల పూజ ముగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత రాత్రి 11 గంటలకు స్వామి వారి ఆలయాన్ని మూసేస్తారు. మండల పూజల ముగింపు తరువాత మకరజ్యోతి ఉత్సవాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ఉత్సవాల కోసం శబరిమల సన్నిధానాన్ని తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 15న మకరవిళక్కు పూజలు నిర్వహిస్తారు. కాగా, మకరవిళక్కు పూజలకు భక్తులు ఆలయానికి పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.