జైలో కవిత మాసికంగా బలంగా ఉన్నారుః బాల్క సుమన్
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/RS-Praveen-Kumar-And-Balka-Suman-Mulakhat-With-Kavitha.jpg)
న్యూఢిల్లీః తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సే కవితను ఈరోజు ఆ పార్టీ నేతలు బాల్కసుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. కవితతో ములాఖత్ అయిన తర్వాత ఆయన మీడియాతో బాల్క సుమన్ మాట్లాడుతూ…విపక్ష నాయకులను అణిచివేయాలనే ఆలోచనలో భాగంగానే కవితని అన్యాయంగా మద్యం పాలసీ కేసులో ఇరికించారని అన్నారు.బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా.. తలవంచకుండా పోరాటం చేస్తామన్నారు. కవిత మాసికంగా బలంగా ఉన్నారన్నారు.
న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో కవిత ఉన్నట్లు చెప్పారు. బీజేపీకి ఎవరు ఎదురు ఉండకూడదనే ప్రతిపక్ష పార్టీలను భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు ఒక కేసే కాదు.. అదొక పాలసీ మాత్రమే అన్నారు.
మద్యం పాలసీ కేసును బూచిగా చూపించి తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయొచ్చనే భ్రమలో బీజేపీ నేతలు ఉన్నారని… కానీ భయపడే ప్రసక్తే లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతినడం ఖాయమన్నారు. బీజేపీ 220 సీట్లు కూడా దాటదని జోస్యం చెప్పారు. ఢిల్లీలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అన్నారు.