కూసుమంచి వద్ద కారు బోల్తా..భారీగా నగదు బ్యాగులు
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/kmm-car-accident.jpg)
ఎన్నికల వేళ భారీగా నగదు బయటపడుతుంది. నిన్న వైజాగ్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న కార్ బోల్తా పడిన ఘటన భారీగా నగదు బయటపడిన ఘటన మరచిపోకముందే..ఈరోజు ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం కేశవాపురం వద్ద ఓ కారు బోల్తాపడింది.
దీంతో కారులో భారీగా నగదు బయటపడింది. కారులోని రెండు బ్యాగుల్లో డబ్బును స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు కోటి రూపాయలు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదుచేసి నగదు తరలింపుపై విచారణ చేస్తున్నారు.