మిలీనియం టవర్-బి నిర్మాణానికి ప్రభుత్వం రూ.19.73 కోట్లు విడుదల
visakhapatnam: విశాఖపట్నం జిల్లాలోని మధురవాడ వద్ద మిలీనియం టవర్-బి నిర్మాణానికి ప్రభుత్వం రూ.19.73 కోట్లు విడుదల చేసింది. టవర్-బి నిర్మాణం కోసం ఐటీశాఖకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టవర్-ఏ నిర్మాణాన్ని ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. విశాఖ మిలీనియం టవర్స్లోనే సచివాలయం కార్యకలాపాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/