హైకోర్టులో రాజధాని రైతుల పిటిషన్
కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై ప్రత్యేక వాజ్యం
అమరావతి: కార్యాలయాల తరలింపుపై ఏపి హైకోర్టులో రాజధాని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతులు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను హైకోర్టు రేపు విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్, సీఆర్డీఏను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/