బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ ఫై రౌడీ షీటర్ దాడి..

బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ వీజే సన్నీ ఫై రౌడీ షీటర్ దాడి చేయడం సినీవర్గాల్లో చర్చగా మారింది. ఖమ్మం జిల్లాకు చెందిన వీజే సన్నీ సినిమాల మీద ఇంట్రస్ట్ తో హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ప్రముఖ ఛానల్ లో రిపోర్టర్ గా తన కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత కొద్ది రోజులకే సీరియల్ లో నటించే అవకాశాలు దక్కించుకున్నాడు. ఆలా సీరియల్స్ లలో నటిస్తూనే, సినిమాల్లో చిన్నాచితక అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ ను సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఛాన్స్ రావడం..హౌస్ లో నిజాయితీగా ఉండడం..ఫ్రెండ్ షిప్ కు ప్రాధాన్యం ఇవ్వడం..ఇవన్నీ కూడా సన్నీ ని టైటిల్ విన్నర్ ను చేసాయి. బిగ్ బాస్ తర్వాత సన్నీ క్రేజ్ పిక్ లెవల్ కు వెళ్ళింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తన కొత్త చిత్ర షూటింగ్ లో ఓ రౌడీ షీటర్ తనపై దాడి చేసాడు.

సన్నీ ఎటిఎం అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ సిరీస్ షూటింగ్ హైదరాబాద్ లోని హస్తినాపురం ప్రాంతంలోజరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం షూటింగ్ జరుగుతుండగా.. ఓ రౌడీ షీటర్ అక్కడికి వచ్చి గొడవ చేసాడు. ఆ తర్వాత సన్నీ ఫై దాడి చేసాడు. దీంతో సినిమా సిరీస్ నుంచి నేరుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సన్నీ దాడి చేసిన రౌడీ షీటర్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న మీర్‌పేట్ పోలీసులు, రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ దాడి విషయం తెలిసి సన్నీ అభిమానులు ఖంగారు పడుతున్నారు. ఈ క్రమంలో సన్నీ సన్నిహితులు స్పందించారు.. వీజే సన్నీ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. చిన్న సమస్యకు గూండాలు వచ్చి గొడవ సృష్టించారు. వారు VJ సన్నీని తాకను కూడా తాక లేదు. అక్కడ ఉన్న బౌన్సర్లు వారిని వెనక్కు నెట్టారు. సన్నీ చాలా సేఫ్ గా ఉన్నారని, అతని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.