జూబ్లీహిల్స్ అత్యాచారం ఘ‌ట‌న‌.. పోలీసుల నిర్ణ‌యాన్నిస్వాగ‌తించిన కేటీఆర్

అత్యాచారం చేసిన మైనర్లకు కూడా పెద్దలకు విధించే శిక్షలనే విధించాలి: కేటీఆర్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న‌పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ కోర్టును కోరే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అత్యాచారం వంటి అత్యంత దుర్మార్గమైన నేరాలకు పాల్పడే వారికి మేజర్లకు విధించే శిక్షలనే విధించాలని అన్నారు.

కాగా, జూబ్లీహిల్స్‌లో బాలిక‌పై అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ అత్యాచారం కేసు నిందితులను విచార‌ణ‌ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డును హైద‌రాబాద్ పోలీసులు కోరారు. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాత విచార‌ణ‌ జరిగే సమయంలో ఐదుగురిని మేజ‌ర్లుగా పరిగణించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/