ఘోర రోడ్డు ప్రమాదం..తొమ్మిది మంది మృతి

Road Accident
Road accident

పితోర్‌గఢ్‌ : ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాగేశ్వర్ జిల్లాలోని సామా నుంచి హోక్రాకు వెళ్తున్న బొలెరో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహాలను వెలికి తీశారు. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని రక్షించి తేజం ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. మృతులు, క్షతగాత్రులు ఆలయానికి బొలెరో వాహనంలో ఆలయంలో పూజల కోసం బయలుదేరారు. సంఘటనా స్థలం వద్ద రోడ్డు అధ్వాన్నంగా ఉందని, దాంతో వాహనం అదుపు తప్పి లోయలో పడి ఉంటుందని భావిస్తున్నారు.