ఘోర రోడ్డు ప్రమాదం 10 మంది మృతి

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు

ఆనంద్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా తారాపూర్ సమీపంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. కారును అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించినట్టు పోలీసులు తెలిపారు.

ప్రమాదం కారణంగా రహదారి రక్తసిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తారాపూర్ రెఫరల్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ జిల్లా కలెక్టరుతో సీఎం మాట్లాడి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/