కేసీఆర్​కు రేవంత్​రెడ్డి సవాల్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై సవాల్ విసిరారు. గత రెండు రోజులుగా మంత్రి మల్లారెడ్డి vs రేవంత్ మాటల యుద్ధం సోషల్ మీడియా ను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఎక్కడ కూడా తగ్గిదిలే అన్నట్లు తమ మాటల యుద్ధం చేసారు. ఇరు పార్టీల నేతలు సవాళ్లు ..ప్రతి సవాళ్లు చేసుకోగా..ఈరోజు రేవంత్ ఓ అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? అని కేసీఆర్ కు సవాల్ విసిరారు.

ప్రభుత్వం రద్దు చేసిన ముందస్తు ఎన్నికలకు వస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ రాజీనామా చేస్తే గజ్వేల్‌లో పోటీకి తాను సిద్ధమని స్పష్టం చేశారు. సెమీఫైనల్స్‌లో మల్లారెడ్డి బంధువుపై మర్రి రాజశేఖర్​రెడ్డిపైనే గెలిచానని ఇక మిగిలింది ఫైనల్స్‌లో కేసీఆర్‌ని ఢీకొట్టడమే అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రేవంత్ సవాల్ వైరల్ గా మారింది. మరి దీనిపై తెరాస నేతలు కానీ,కేసీఆర్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.