కొమురం భీం జిల్లాలో తెరాస పార్టీకి భారీ షాక్

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ తెరాస కు భారీ షాక్ తగిలింది. కొమురం భీం జిల్లాలో ఒకరు..ఇద్దరు కాదు ఏకంగా 24 మంది సర్పంచ్ లు తమ పదవులకు రాజీనామా చేసి నిరసన బాట బట్టారు. గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదు..ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం జరగడం లేదని వారంతా వాపోతూ నిరసన తెలుపుతున్నారు.

కొమురం భీం జిల్లా వాంకిడి మండలానికి చెందిన 24 గ్రామాల సర్పంచులు తమ పదవులతో పాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేసారు. తమ రాజీనామాలు ఆమోదించేలా చూడాలని జడ్పీ చైర్‌‌పర్సన్‌కు ఆ సర్పంచులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని..పోడు భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గ్రామాల్లో తిరగలేక పోతున్నామని వారంతా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం సర్పంచ్ ల రాజీనామా జిల్లా వ్యాప్తంగా చర్చ గా మారింది.