రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర..?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కు సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకరావాలని , రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యం తో రేవంత్ పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 9 న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రేవంత్ పాదయాత్ర ను ప్రారభించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ పాదయాత్రకు ఢిల్లీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా? అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యనేతలు చర్చించారు. ఈ సమావేశంలో రేవంత్ పాదయాత్ర ను వారి ముందు పెట్టినట్లు తెలుస్తుంది.

మరోపక్క బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రేపు సోమవారం నుండి ఐదో విడుత ప్రజాసంగ్రామ యాత్ర మొదలుపెట్టబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం జిల్లాల పర్యటన కు సిద్ధమయ్యారు. దీనికి సంభదించితిన్ రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసారు. ఇలా అన్ని పార్టీల నేతలంతా కూడా ప్రజల్లోకి వెళ్తుండడంతో రేవంత్ కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని , కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సహం తీసుకరావాలని చూస్తున్నట్లు అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.