కెసిఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ రేవంత్ సంచలన ఆరోపణలు

revanth-reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్ ఫై సంచలన ఆరోపణాలు చేసారు. కెసిఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ..హైదరాబాద్ చుట్టూ కెసిఆర్ కుటుంబం పది వేల ఎకరాలు ఆక్రమించుకుందని ఆరోపించారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టడానికి జాగా లేదన్న కెసిఆర్.. వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు.

ప్రభుత్వ భూములు కొనుగోలు చేస్తున్న వారికి రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ఔటర్ రింగ్ రోడ్డులు అమ్ముకోవడానికి, దళితుల భూములు లాక్కోవడానికి కాదన్నారు. వందల ఎకరాలు ఎలా అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కొన్నవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని పలు సర్వేలు చెబుతున్నాయని, ఆ పార్టీకి కనీసం 25 సీట్లు కూడా రావని, ఈ కారణంగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశ్యంతో భూములను అమ్మి వాటి ద్వారా వచ్చే సొమ్మును మూటగట్టి విదేశాలకు పారిపోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. సొంతవాళ్లకు అప్పగించేందుకు వైన్ షాపులకు ముందే టెండర్లు వేస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

సొంతవాళ్లకు అప్పగించేందుకు వైన్ షాపులకు ముందే టెండర్లు వేస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.