ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయంః రేవంత్ రెడ్డి
హైదరాబాద్ః టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీటర్ వేదికగా మరోసారి తెలంగాణ సర్కార్పై మండిపడ్డారు. తెలంగాణ లో పేద పిల్లల చదువుకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని విమర్శంచారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో పేద పిల్లల చదువులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది. ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ‘మన ఊరు – మన బడి’ ఓ ప్రచారార్భాటం. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయం’’ అని రేవంత్ ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/