నేడు భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీః నేడు 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పార్లమెంట్ హాలులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి కొత్తగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఉదయం 10.15 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, గవర్నర్, ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వంలోని ప్రముఖ సివిల్, మిలటరీ అధికారులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆమె ప్రసంగం ఉంటుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో వేడుక ముగిసిన తర్వాత, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్కు బయలుదేరుతారు. కాగా, 2017లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రాంనాథ్ కోవింద్ పదవీ కాలం ముగిసింది. నిన్న ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/