మొటిమలకు ఇంట్లోనే చికిత్స
అందమే ఆనందం-
మొటిమలు తీవ్రమై కౌమారదశలో మానసిక పరిణామాలను కలిగిస్తాయి. ముఖం మీద నూనె, అధిక దుమ్ము, హార్మోన్ల మార్పుల వల్ల మొటిమలు వస్తాయి.
అలాగే కొంతమందికి మొటిమలు స్వయంచాలకంగా వస్తాయి. వాటంతట అవే నయం అవుతాయి. ఈ రంధ్రాలు చర్మం మధ్యలో చిన్న మార్పు వల్ల కలుగుతాయి. చర్మం మధ్యలో ఈ మార్పు ముఖ రంధ్రాలకు కారణమవుతుంది.
వీటిని అట్రోఫిక్ మొటిమల మచ్చలు అని కూడా అంటారు. చిన్న మొటిమలు ఉంటే వాటిని తక్కువ సమయంలో పరిష్కరించవచ్చు.
మొటిమలు అదృశ్యమైన తరువాత, ఆ ప్రదేశంలో మచ్చలు వదలి, రంద్రాలు ఏర్పడితే వాటిని వదిలించుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది.
మొటిమలకు ఇంట్లోనే చికిత్స చేయవచ్చు. మొటిమల మచ్చలను వదిలించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మార్కెట్లో మొటిమల రంద్రాలను తొలగించడానికి రసాయనాలతో కలిపిన ఖరీదైన ఉత్పత్తులు చాలా ఉన్నాయి.
వీటిని ఉపయోగించడం వల్ల తక్షణ పరిష్కారం లభించినా అవి కొన్ని దుష్ఫ్రభావాలను కలిగిస్తాయి. మొటిమల రంధ్రాలు చర్మంలో సహజమైన లోపం వల్ల సంభవిస్తాయి. కాబట్టి సహజ మార్గంలో దాన్ని పరిష్కరించడం మంచిది.
ముఖానికి ఏదైనా చికిత్స ప్రారంభించే ముందు ముఖాన్ని యాంటీ బాక్టీరియల్ సబ్బుతో బాగా కడగాలి. అప్పుడు రంధ్రాలపైన ఎసస్పొలిట్ అనగా కాఫీ పౌడర్, ఓట్స్, ఉప్పు లేదా చక్కరను ఉపయోగించాలి.
పసుపు పొడి, నిమ్మ ఆకులు పేస్ట్లా చేసి రంద్రాలపై రాయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడలాగి. ఇలా రెండు వారాలపాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది.
కొద్దిగా పెరుగు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి రంద్రాలపై రాయాలి. తేనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.
ఇవి చర్మంలోని రంధ్రాలను బాగు చేస్తాయి.
కాబట్టి తేనె తీసుకుని చర్మ రంధ్రాలపై నేరుగా పూయాలి. పెరుగు, బంగాళాదుంపలు, తేనె, వేరుశెనగ పిండిని కలిపి రంధ్రాలపై రాయాలి.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/