సినిమాల్లోకి కొడుకు ఎంట్రీ ఫై రవితేజ ఫుల్ క్లారిటీ

కొడుకు ఎంట్రీ ఫై మాస్ రాజా రవితేజ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – భీమ్స్ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.

ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడం తో రవితేజ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ గా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..తాను కొడుకు మహాధన్ సినిమాల్లోకి ఎంట్రీ ఫై క్లారిటీ ఇచ్చారు. మహాధన్ సినిమాల్లోకి రావచ్చు.. రాకపోవచ్చు.. ఇంట్రెస్ట్ ఉందా లేదా అని నేను చెప్పలేను. వాడికి పూర్తి క్లారిటీ ఉంది.. సినిమాల్లోకి రావాలో వద్దో అనేది వాడి ఇష్టం. నాకు తెలిసినంతవరకు డెఫినెట్గా వాడు సినిమాల్లోకి వస్తాడు.. సినిమాలంటే వాడికి ఇంట్రెస్ట్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు వాడేదో చేస్తున్నాడు.. చేయనివ్వండి.. వాడు సినిమాల్లోకి వస్తాడు కానీ అది ఎప్పుడు వస్తాడో చెప్పను అంటూ రవితేజ తెలిపాడు..పోనీ ఇండస్ట్రీకి వచ్చే ముందు మీరు మీ కొడుకుకు ఎలాంటి సలహా ఇస్తారు అని అడగగా.. అసలు ఇవ్వను.. నేను ఇచ్చే సలహాలు ఎప్పుడో అయిపోయాయి.. వాడు చాలా క్లియర్ గా ఉన్నాడు.. నా సలహాలు తీసుకునే స్టేజ్ కూడా దాటిపోయాడు. ఇప్పుడు అన్ని వాడే తెలుసుకోవాలి అంటూ తెలిపాడు.