ఖమ్మం జిల్లా బైక్ లిఫ్ట్ మిస్టరీ వీడింది..చంపించింది భార్యనే
ఖమ్మం జిల్లాలో బైక్ లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి ద్విచక్రవాహనదారుడిని దారుణంగా హత్య చేసిన ఘటన మిస్టరీ వీడింది. కట్టుకున్న భార్యే ఈ హత్య చేయించినట్లు తేలింది. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని బాణాపురంలో పని మీద బైకుపై జమాల్ సాహెబ్ వెళ్తుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపై ఆపాడు. అనంతరం అర్జెంట్ పని మీద వెళ్తున్నట్లు లిఫ్ట్ ఇయ్యవల్సిందిగా కోరాడు. వెళ్లే దారిలోనే కదా అని అతన్ని కూడా బైకుపై ఎక్కించుకుని కొంత దూరం వెళ్లారు. ఐతే మార్గం మధ్యలో జమాల్ సాహెబ్ ను సదరు దుండగుడు ఇంజెక్షన్ ఇచ్చాడు.
దీంతో వెంటనే జమాల్ సాహెబ్ స్పృహ తప్పి, కింద పడిపోయాడు. జమాల్ సాహెబ్ చూసిన కొంతమంది దగ్గరలోని హాస్పటల్ కు తరలించగా..అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసు ఫై ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియ ప్రత్యేక దృష్టి సారించి,..ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు.
పక్క ప్లాన్ తోనే జమాల్ ను హత్య చేసారు. ప్రస్తుతం పోలీసులు మోహన్రావు, వెంకటేశ్, వెంకట్, జమాల్ భార్య ఇమామ్బీ లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చింతకాని మండలం నామవారం వాసులు. రెండునెలల నుంచే జమాల్సాహెబ్ హత్యకు కుట్రపన్నిన నిందితులు. వివాహేతర సంబంధానికి జమాల్ అడ్డు వస్తున్నాడని హత్యకు ప్లాన్ చేసి హత్య చేసారు. భర్తను చంపేందుకు ఇంట్లోనే ఇంజక్షన్ ను ఇమామ్బీ దాచిపెట్టింది. దీనికి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.