అయోధ్యలో శ్రీరాముడి కోసం 8 అడుగుల బంగారు సింహాసనం

Ram Lalla’s idol to be placed on 8-ft-tall gold-plated throne inside Ayodhya temple

అయోధ్యః అయోధ్య రామమందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి ముస్తాబవుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ఆలయ ప్రారంభోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించింది ఆలయ ట్రస్టు. మరోవైపు ఆలయంలో రామయ్య విగ్రహ ప్రతిష్టాపన పనుల్లో వేగం పెంచింది. అయితే ఈ రామాలయ గర్భగుడిలో పాలరాతితో చేసి బంగారు పూత పూయించిన 8 అడుగుల ఎత్తు ఉన్న సింహాసనాన్ని నెలకొల్పుతారట. ఈ పీఠంపైనే రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారట. ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉండే ఈ బంగారు సింహాసనాన్ని రాజస్థాన్‌లోని హస్తకళాకారులు తయారు చేస్తున్నారట. డిసెంబర్ 15 నాటికి ఈ సింహాసనం అయోధ్యకు చేరుకుంటుందిట.

గర్భగుడి నిర్మాణం కూడా పూర్తయిందని ఆలయ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర తెలిపారు. డిసెంబర్ 15 నాటికి రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌ రెడీ అవుతుందని.. ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్​లో 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్​లో 17 స్తంభాలు ఏర్పాటు చేయగా, అందులో రెండింటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలోని మూడు అంతస్తుల్లో పైకప్పులు నిర్మించామని పేర్కొన్నారు.. అలాగే మందిరం ప్రవేశ ద్వారం వెలుపలి గోడ(పార్కోట) పనులు కూడా చివరి దశలో ఉన్నాయని వివరించారు.