విరాట పర్వం ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిధులుగా చరణ్ , సుకుమార్

‘విరాటపర్వం’..దగ్గుపాటి రానా , సాయి పల్లవి , ప్రియమణి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల డైరెక్షన్లో తెరకెక్కింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రం గత కొద్దీ నెలలుగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే అంకితమైంది. ఓటిటిలలో రిలీజ్ అవుతుందని పలుమార్లు వార్తలు వినిపించినప్పటికీ మేకర్స్ మాత్రం థియేటర్స్ లలోనే రిలీజ్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు.

తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించి హమ్మయ్య అనిపించారు. ఈ సినిమాను జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రమోషన్ ఫై దృష్టి సారించారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకా ట్రైలర్ , సాంగ్స్ ఆకట్టుకోగా..రేపు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ను అట్టహాసంగా జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో పాటు ఎఫ్ 3 సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ లు హాజరుకాబోతున్నారు. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన చేశారు.

ఇక ఈ సినిమాను తెలంగాణలో జరిగిన కొన్ని యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో రాబోతుండగా, రానా దగ్గుబాటి ఇందులో ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే నివేదా పేతురాజ్, సాయిచంద్, నందిదాతాస్త దితరులు నటిస్తుండగా, సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు.