ఏపిలో ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్
దేశంలోని 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
అమరావతి: దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఏపికి సంబంధించి నాలుగు స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాలు1లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సిపి నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, టిడిపి నుంచి వర్ల రామయ్య ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఏపితో పాటు గుజరాత్లో 4, రాజస్థాన్లో 3, మధ్యప్రదేశ్లో 3, జార్ఖండ్లో 2, మణిపూర్, మిజోరం, మేఘాలయాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/