ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత

Raju Srivastav dies

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధువారం ఉదయం కన్నుమూశారు. రాజు శ్రీవాస్తవ మరణంతో బాలీవుడ్​లో విషాదం అలుముకుంది. రాజు కుటుంబానికి బాలీవుడ్ సెలబ్రిటీలు సానుభూతి తెలుపుతున్నారు. రాజు శ్రీవాత్సవ మరణం బాలీవుడ్ కామెడీకి తీరని లోటని పలువురు కమెడియన్లు అభిప్రాయపడ్డారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కమెడియన్ రాజు శ్రీవాస్తవ విషయానికి వస్తే.. గ్రేట్ ఇండియా లాఫ్టర్ ఛాలెంజ్‌తో అభిమానులను సంపాదించకొన్నారు. ఆ తర్వాత కామెడీ కా మహా ముకాబలా, కామెడీ సర్కస్, కామెడీ నైట్స్ విత్ కపిల్ లాంటి షోలతో పాపులారిటి సంపాదించుకొన్నారు. ఆగస్టు 9వ తేదీన ఈయన గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్సను అందిస్తూ వస్తున్నారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు.