రాజస్థాన్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల

జైపూర్ః ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. తాజాగా రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రజాకర్షక మేనిఫెస్టోను విడుదల చేసింది. జైపుర్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీనియర్ నేత సచిన్ పైలట్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని.. రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, స్వామినాథన్ కమిషన్ ప్రకారం కనీస మద్దతు ధర ఇస్తామని మేనిఫెస్టోలు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.