చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

Rajashyamala yagam at TDP chief Chandrababu’s residence

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తమ నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఇవాళ తొలిరోజున చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు పూజా కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. రాజశ్యామల యాగం మూడ్రోజుల పాటు జరగనుంది. ఆదివారం నాడు పూర్ణాహుతితో ముగియనుంది. ఆ క్రతువుకు పలువురు టిడిపి నేతలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. వేదమంత్రాలతో చంద్రబాబు నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.